ఈ రోజు మా కుటుంబం మొత్తం రాట్నాలకుంట రాట్నాలమ్మ వారిని దర్శించుకోవటం జరిగింది
ఈ ఆలయం ఏలూరు నుండి సుమారు 20 km దూరంలో ఉంది ఈ దేవాలయంలో ఎక్కువుగా దర్శించుకునే భక్తులు పొయ్యిమీద క్షీరాన్నం వండి అమ్మ వారికి నైవేద్యంగా పెడతారు
మేము ఈ ఆలయం దర్శించుకునేటప్పటికి ఉదయం 7.30 సమయం అవుతుంది చాలా ఖాళీగా ప్రశాంతంగా దర్శనం అయ్యింది
పూర్వం ఇక్కడ పాత గుడి ఉండేది అంటా ఆ గుడి ప్రాంగణం అంతా మండపం సుందరంగా తీర్చి దిద్దుతున్నారు
చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు నీరు కూడా చాలా తక్కువుగా ఉంది ఇది బాగా మేరక ప్రాంతంలాగా ఉంది
వచ్చే దారిలో అన్ని మొక్క జొన్న తోటలు, నిమ్మ తోటలు ,కోకో తోటలు ఎక్కువ ఉన్నాయి ఎర్ర నేల ఇది
ఈ గుడికి సంబందించిన కొన్ని ఫోటోలు క్రింద ఉన్నాయి గమనించగలరు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి