కరోనా వచ్చి దాని నుండి బయటపడి పూర్తి ఆరోగ్య వంతులుగా తయారు అయ్యిన తరువాత వారిలో ఆ రోగానికి సంబంధించి యాంటీబాడీలు శరీరం లో తయారు అవుతాయి
ఆ యాంటీబాడీలు ప్లాస్మా లొనే ఉంటాయి అందుకే దీనిని సంజీవని అంటారు
అసలు ప్లాస్మా అంటే మన రక్తంలో నీటిమాదిరిగా ఉండే పసుపు పచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు
ఈ ప్లాస్మా కోసం చాలామందిలో చాలా అపోహలు ఉన్నాయి ప్లాస్మా ఇస్తే మనకు మళ్ళీ కరోనా వస్తాది ఏమో నని మనిషి మరల కరోనా బారిన పడతాడు ఏమో అని చాలా అపోహలు ఉన్నాయి
కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్లాస్మా మరో జన్మని ప్రసాదిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు !!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి